Friday, April 18, 2025 | Sandesh TV Daily News
Logo

తెలంగాణ పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ మరో నలుగురికి టికెట్ కన్ఫర్మ్ చేసింది

news.title

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. మెదక్‌ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, నిజామాబాద్‌ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది.