హైడ్రాను మరింత పటిష్టం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
| హైదరాబాద్: రాష్ట్రంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) సేవలను మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు వ్యాఖ్యలు, పరిణామాల నేపథ్యంలోనూ హైడ్రా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హైడ్రా పనితీరును, ప్రభుత్వ సంకల్గాన్ని మరోసారి గట్టిగా సమర్థించారు. ఆక్రమణదారులు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, జలవనరులను కాపాడటంలో హైడ్రా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని, దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థకు ప్రశంసలు దక్కుతున్నాయని తెలిపారు. న్యాయస్థానాలపై గౌరవం ఉంది..కోర్టు తీర్పులు, ఆదేశాలపై స్పందిస్తూ.. న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులను తాము పూర్తిగా గౌరవిస్తామని సీఎం తెలిపారు. అయితే, అధికారుల నియామకం అనేది పూర్తిగా ప్రభుత్వ అధికార పరిధిలోని అంశమని, దీనిపై చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలోనూ అధికారులపై వందల సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న ఉదాహరణలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.ఆక్రమణదారుల ఆటలు సాగవుచెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు మరియు ప్రభుత్వ భూములను ఆక్రమించిన బకాసురుల నుంచి భూములను కాపాడటమే హైడ్రా ప్రధాన విధి అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు కావాలనే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించే దుష్ట ప్రయత్నాలను ప్రభుత్వం తిప్పికొడుతుందని హెచ్చరించారు. పేదల సంక్షేమం, భవిష్యత్ తరాల రక్షణ కోసం హైడ్రా వ్యవస్థను మరింత శక్తివంతం చేసి ముందుకు వెళ్తామని సీఎం పునరుద్ఘాటించారు.#HYDRAA #RevanthReddy #TelanganaNews #Hyderabad #LakeProtection #TelanganaCM #HYDRAAUpdates...