Friday, April 18, 2025 | Sandesh TV Daily News
Logo

news.title

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం గురువారం విడుదల చేసింది. . తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లు. మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు ఆదిలాబాద్‌ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్‌ మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేశ్‌, సీతారాం నాయక్‌ ఇటీవలే బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు.