నంద్యాలలో రూ.50 లక్షల వెటర్నరీ మందులు వృథా: అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన

నంద్యాల జిల్లాలో ప్రజాధనంతో కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల వెటర్నరీ మందులు రైతులకు చేరాల్సింది పోయి చెత్తకుప్పల పాలు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రూ.50 లక్షలకు పైగా విలువైన పశువుల మందులను సకాలంలో పంపిణీ చేయకుండా గోదాముల్లో ఉంచి, గడువు ముగిశాక బయటపడేశారన్న సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గాలికుంటు వ్యాధితో మూగజీవాలు అల్లాడుతుంటే, ప్రాణరక్షక మందులు అందుబాటులో లేకపోవడం పట్ల పశుపోషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ మందుల వృథా వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన కథనం ఈ వీడియోలో చూడండి.

Watch The Video